TG | గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ – మంత్రి బర్గర్ విస్తరణ కోసమేనా?

  • Post category:Blog
  • Post last modified:March 30, 2025

హైద్రాబాద్ |ఉగాది వేళ ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఈ విధంగా రేవంత్ రెడ్డి గవర్నర్‌తో సమావేశం కావడంతో ఈ అంశానికి రాజకీయంగా విపరీతంగా ప్రాధాన్యత దక్కుతోంది.

ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ ఎపుడు అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్‌ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని అంటున్నారుఆ రోజున మంచి ముహూర్తం ఉందని చెబుతున్నారు.

ఇక మంత్రివర్గంలోకి ఎవరికి తీసుకోవాలన్నది హైకమాండ్ వద్దనే లిస్ట్ ఫైనలైజ్ అయింది అని అంటున్నారు. తగిన సమయంలో వారికి ఫోన్లు వస్తాయని మంత్రులుగా వారు ప్రమాణం చేయడమే తరువాయి అని అంటున్నారు. అయితే మీడియాలో వచ్చిన పేర్లు కాకుండా అనూహ్యంగా కొంతమందికి మంత్రి చాన్స్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు.