భద్రాచలం : భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా భద్రాచలం సీతారాముల కళ్యాణంకు విచ్చేసారు.
కాగా ,భద్రాచలంలో అభిజిత్ సుముహుర్తమున శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే రాములోరి కల్యాణోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి ఆయన సతీమణి గీత తో కలిసి హాజరయ్యారు. అనంతరం స్వామి వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వేద పండితులకు అందజేశారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించుకుని వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మేరకు సీఎం దంపతులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
దర్శనం తర్వాత మిథిలా స్టేడియం ప్రాంగణం చేరుకున్నారు. కళ్యాణ ద్వారం వద్ద పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,కొండ సురేఖ ఎమ్మెల్యేలు తెల్లం, కోరం,పాయం తదితరులు స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యర్, జిల్లా కలెక్టర్ జితేష్,ఎస్పీ రోహిత్ రాజ్ వారితో ఉన్నారు.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరుఫున చైర్మన్ బీఆర్ నాయుడు భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సరేఖ, సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు
ఈ కళ్యాణోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,ఆయన సతీమణి, కుమారునితో హాజరయ్యారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, సీఎస్ శాంతికుమారి దంపతులు, దొంతు మాధవరెడ్డి ఎమ్మెల్యే సైతం కళ్యాణానికి విచ్చేసిన వారిలో ఉన్నారు.

