హైదరాబాద్ : ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సిబిల్ స్కోరు తప్పనిసరి కానుంది. గతంలో ఏవైనా లోన్లు తీసుకొని కట్టనివారు అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. వాటి ఆధారంగా 40 శాతం అప్లికేషన్లు రిజక్ట్ అయ్యే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీం కోసం 16.25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నది..
Telangana | రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోరు తప్పనిసరి!
- Post category:జాతీయం
- Post last modified:May 5, 2025
