శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రయాణికుడిని అమీర్ అహ్మద్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Shamshabad Airport | భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- Post category:జాతీయం
- Post last modified:February 18, 2025
