చిట్యాల, ఏప్రిల్ 30 (ఆంధ్రప్రభ) : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేటకు చెందిన కొక్కుల ఐలయ్య, కళా దంపతుల కుమారుడు కొక్కుల శివ (21) హైదరాబాదులో బీటెక్ చదువుకుంటున్నాడు. కాగా నాచారంలో కిరాయికి ఉంటున్న ఇంట్లో మంగళవారం సాయంత్రం ఇనుప కూలర్ లో నీళ్లు పోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుకు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బీటెక్ విద్యార్థి మృతితో కుటుంబంతో పాటు నవాబుపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
WGL | విద్యుద్ఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి
- Post category:జాతీయం
- Post last modified:April 30, 2025
