ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. తాజాగా ఈ విషయంపై ఎంఐ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ను సారథిగా నియమిస్తున్నట్లు వెల్లడించింది..ఇది ఇలా ఉంటే ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2025 ఫస్ట్ మ్యాచ్లో ఆడటం లేదు. గతేడాది ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్కు గురయ్యాడు హార్దిక్. ఈ కారణంగానే మార్చి 23వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో అతడు ఆడటం లేదు. దీంతో అతడి స్థానంలో తొలి మ్యాచ్లో కొత్త కెప్టెన్గా సూర్యకుమార్ను నియమించింది ఎంఐ మేనేజ్మెంట్. ఈ ఒక్క మ్యాచ్కే మిస్టర్ 360 సారథిగా వ్యవహరిస్తాడు. మిగతా మ్యాచుల్లో పాండ్యా కెప్టెన్గా కొనసాగుతాడు.
IPL 2025 | ముంబైకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు…
- Post category:జాతీయం
- Post last modified:March 19, 2025
