తిరుమల : కలియుగ దైవం, తిరుమల వెంకటేశ్వర స్వామిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ దర్శించుకున్నారు.బుధవారం సుప్రభాత సేవలో ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. వైకుంఠ వాసుడు, దేవదేవుడు శ్రీనివాసుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Tirumala | శ్రీవారిని దర్శించుకున్న నీలం మధు..
- Post category:జాతీయం
- Post last modified:April 16, 2025
