Palnadu | రాజ‌కీయాల‌లో చెత్త‌ను ఊడ్చి పారేస్తాం : చంద్ర‌బాబు

ఫ్యాక్ష‌న్ అంటు విర్ర‌వీగితే తోక‌లు క‌త్తిరిస్తాం

ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌ను ప్ర‌క్షాళ‌న చేశాం

ఇప్ప‌డు ప‌ల్నాడుపై దృష్టి పెట్టాంప‌ల్నాడు స‌భ‌లో చంద్ర‌బాబు వెల్ల‌డి

మాచర్ల, ఆంధ్రప్ర‌భ రౌడీయిజం.. నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో శ‌నివారం నాడు జ‌రిగిన స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా యాదవుల బజారులో పారిశుధ్య కార్మికులతో క‌ల‌సి వీధుల‌ను శుభ్రం చేశారు. అనంత‌రం కార్మికుల‌తో మాట్లాడి వారి క‌ష్ట‌సుఖాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం హెల్త్ క్యాంప్‌ను పరిశీలించారు..ఇదే సంద‌ర్భంగా స్వచ్చ రథాన్ని జెండా ఊపి ఆరంభించారు. . ఆ తర్వాత ఎస్కేబీఆర్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేద‌ని అన్నారు.

ఎవరి ప్రవర్తన బాగాలేకపోయినా ప్రజలు క్షమించరని తెలిపారు.. చాలా అరాచకాలు జరిగాయ‌ని,వాటిన్నింటి చూశామ‌ని అన్నారు. ఇప్ప‌టికే . రాయలసీమలో ముఠాలు లేకుండా చేశామ‌ని చెబుతూ ఇప్ప‌డు పల్నాడులో కూడా ఫ్యాక్ష‌న్ వివాదాలు లేకుండా చేస్తున్నామ‌ని అన్నారు చంద్ర‌బాబు.. ఇక్క‌డి ముఠాలు జాగ్రత్తగా ఉండాలని.. ప్రజలపై దాడులు చేయవద్దని హెచ్చరించారు. ఇటీవల కాలంలో తనలాంటి నాయకుడే మాచర్లకు రాలేని పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చే పరిస్థితి చూస్తున్నామని చంద్రబాబు అన్నారు.

ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదామ‌ని ఈ సంద‌ర్బంగా పిలుపు ఇచ్చారు.చెత్త తీస్తేనే సరిపోదు.. మనసుల్లో చెత్తను కూడా పూర్తిగా తొలగించాల‌ని అన్నారు. . గత వైసిపి ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై వేసింద‌ని, దానిపై కూడా పన్ను వ‌సూలు చేసింద‌ని గుర్తు చేశారు.. తాము రాగానే పన్ను తొలగించామ‌ని అంటూ చెత్త తొలగించడంతోపాటు చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం” అని చంద్రబాబు తెలిపారు.