Telangana | ఆఫీసు స్పేస్ లీజింగ్ తిరోగ‌మ‌నం – రేవంత్ ను ప్ర‌శ్నించిన కెటిఆర్

హైద‌రాబాద్ – కొత్త ఐటీ పార్కులను ప్లాన్ చేయడానికి ముందు తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్‌లో 41 శాతం క్లీణతను పరిష్కరించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచించారు..జనవరి-మార్చి క్వార్టర్‌లో ఇప్పటివరకు నమోదైన లావాదేవీల ఆధారంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ విడుదల చేసిన నివేదికలో దేశంలో తొలి 3 నెలల్లో ఆఫీస్ లీజింగ్ మెరుగైన వృద్ధిని సాధించగా హైదరాబాద్, కోల్ కతాల్లో మాత్రం క్షీణత కనిపించిదని ఈ నివేదిక పేర్కొంది. దీనిపై కెటిఆర్ త‌న ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ, ఈ తిరోగమణం దేశవ్యాప్తం జరుగుతున్నదని కాదని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్ సీఆర్, ముంబయి, పుణే వంటి నగరాలు గణనీయమైన వృద్ధిని సాధిస్తుంటే.. హైదరాబాద్ మాత్రం తిరోగమనంలో ఉందని గుర్తుచేశారు. గతంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండేదని.. ఇప్పుడు క్షీణించడంపై ప్రభుత్వం తన పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.ఈ విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.

https://twitter.com/KTRBRS/status/1908351274694606950