బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి దాసోజు శ్రవణ్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. నందినగర్లోని నివాసంలో దాసోజు శ్రవణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు విధేయుడైన దాసోజు శ్రవణ్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్ ఆయనకు తన విషెస్ తెలిపారు..
TG | కేసీఆర్ను కలిసిన దాసోజు శ్రవణ్..
- Post category:జాతీయం
- Post last modified:March 11, 2025
