న్యూ ఢిల్లీ – పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెలవుపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు శ్రీనగర్ విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇక త్రివిధ బలాలలను ఎక్కడికక్కడ యాక్టివేట్ చర్యలను అధికారులు ప్రారంభించారు.. అన్ని వైమానిక స్థావరాలలోనూ యుద్ద విమానాలు కథన రంగంలోకి దిగడానికి సిద్ధం చేస్తున్నారు.. ఇక నావికాదళం సముద్రతీర ప్రాంతాలలో భారీ ఎత్తున యుద్ధ నౌకలను మోహరించింది.. సరిహద్దులకు వేలాదిమంది సైన్యాన్ని తరలిస్తున్నారు..
Ready for War | పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు
- Post category:జాతీయం
- Post last modified:April 25, 2025
