తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం 200వ మెట్టు వద్ద గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భక్తుడు మృతి చెందాడు. మృతి చెందిన భక్తుడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన వెంకటేశ్ (50) గా గుర్తించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.
TTD | శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుడికి అస్వస్థత .. చికిత్స పొందుతూ మృతి
- Post category:జాతీయం
- Post last modified:February 18, 2025
