జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు గ్రామాలలో (సోమవారం) భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్దం రావడంతో ఇండ్లలోని ప్రజలంతా బయటకు వచ్చి చూశారు. కాగా, మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో స్వల్ప భూకంపాలు సంభవించినట్లు సమాచారం. మండలంలో భూమి స్వల్పంగా కంపించినా, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ADB | జన్నారంలో కంపించిన భూమి…
- Post category:జాతీయం
- Post last modified:May 5, 2025
