వికారాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్ర ప్రభ) : ప్రభుత్వ పాఠశాలలోని పైకప్పు పెచ్చులూడి విద్యార్థినిపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మున్నూరు సోమారం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న శిరీష పై పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడి తల, చెవికి, కాళ్లకు గాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన ఆ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి ఆ అమ్మాయిని వికారాబాద్ శారద హాస్పిటల్ కు తరలించగా, డాక్టర్ రాజశేఖర్ ఆ బాలికకు చికిత్సను అందిస్తున్నారు. డీఈఓ రేణుక దేవి బాలికను పరామర్శించారు.
Vikarabad | గాయపడిన విద్యార్థినిని పరామర్శించిన డీఈఓ రేణుక దేవి
- Post category:జాతీయం
- Post last modified:April 16, 2025
