బెంగళూరు : ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరిరంగన్ గతంలో జేఎన్ యూ ఛాన్సలర్ గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. 1994-2003 వరకు ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్ కు డైరెక్టర్ గా పనిచేశారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
RIP | ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత
- Post category:జాతీయం
- Post last modified:April 25, 2025
