ఫరీదాబాద్ – హర్యానాః ఆయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి జరిపే కుట్రను పోలీసులు భగ్నం చేశారు.. విశ్వసనీయ సమాచారంలో సెంట్రల్ ఏజెన్సీలు, ఫరీదాబాద్ ఎస్టీఎఫ్ , గుజరాత్ ఎటిఎస్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి హర్యానాలోని ఫరీదాబాద్లో ఉగ్రవాది, 19 ఏళ్ల వయసున్న అబ్దుల్ రహమాన్ ని అరెస్ట్ చేసి గుజరాత్కు తరలించారు. నిందితుడు యూపీకి చెందినవారిగా గుర్తించారు. అతని దగ్గర నుంచి రెండు హ్యాండ్ గ్రేనేడ్లు, రాడికల్ మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు.
Haryana | అయోధ్యపై దాడికి కుట్ర – పాక్ ఉగ్రవాది అరెస్ట్
- Post category:జాతీయం
- Post last modified:March 3, 2025
