అమరావతి : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకల్లో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది.
HIGH COURT | ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- Post category:జాతీయం
- Post last modified:April 3, 2025
