ప్రతి ప్రక్రియకు ఒక నియంత్రణ అవసరం కానీ ఆ నియంత్రణ మన చేతిలో లేదు. అయస్కాంతము, ఇనుము తమంత తాముగా ఒక చోటుకి చేరలేవు. వాటిని దగ్గరకు చేర్చేవారు కావాలి. అయస్కాంతమూ ఒక ప్రదార్ధమే అంటే సృష్టించబడినది. అది ఒక లో#హమని భూ అంతర్భాగంలో లభిస్తుందని తెలుసుకున్నాము. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్ని సృష్టించబడినవే కానీ మనము సృష్టించలేదు. మనవల్ల కానిది మనకంటే శక్తివంతుడు చేయాలి. నలుగురు చేయలేనిది ఒక యంత్రం చేస్తుంది, కానీ ఆ యంత్రము కూడా నలుగురు కలిసి చేసినదే. అనగా కర్త లేకుండా ఏ కర్మా జరగదు. సృష్టి అనేది కూడా కర్మే కానీ ఆ కర్మను మనం చేయలేము కావున మనకంటే శక్తివంతుడు సృష్టి చేస్తాడని తెలుసుకోవాలి. ఆ శక్తివంతుడే పరమాత్మ. ఒకే మనిషి ఒకే రోజు వేరు వేరు సమయాలలో వేరు వేరు భావాలతో ఉంటాడు దానికి కారణం చూసినవి, విన్నవి. మనం కావాలనుకున్నవాటిని చూడలేము కానీ ఆప్రయత్నంగా కొన్ని చూస్తుంటాం, వింటుంటాం. మనలో కలిగే భావాలకు కూడా మనం కర్తలము కాదు. మనలో కలిగే బావాలే మనవి కానప్పుడు మనమున్న ప్రపంచం మనం ఎలా సృష్టిస్తాం. కావున సృష్టించేవాడు, నిలిపివాడు, సం#హరించేవాడు పరమాత్మే. ఈ మూడింటిని నియంత్రించేవాడు, అయస్కాంతానికి కూడా ఆ శక్తిని ఇచ్చినవాడు పరమాత్మ.
సృష్టి అంతా అయస్కాంత క్షేత్రమని, దీనిని సృష్టించినవాడు పరమాత్మ అని అంటారు. ఏది నిజం?
- Post category:జాతీయం
- Post last modified:May 2, 2025
