- చారిత్రాత్మక కాలేజీ రూపు రేఖలు మారుస్తాం
- కళాశాల అభివృద్ధికి అడుగులు వేస్తున్నాం
- కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
(ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో ) : ఒక ప్రణాళికాబద్ధంగా గుంటూరు నగరాన్ని, జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) చెప్పారు. గుంటూరు నగరంలోని స్థానిక మహిళా డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ (MLA Mohammad Naseer Ahmed) తో కలిసి మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ వస్తున్నామన్నారు. కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇంకొన్ని సీఎస్ నిధుల ద్వారా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (Government Degree College for Women) లో పేద విద్యార్థులు చక్కగా చదువుకునే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారన్నారు. ఈ కాలేజీలో ఎంతో నిపుణులైన ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఉందన్నారు. సుమారు 2,500 మంది విద్యార్థులు చదువుతున్న ఈ కాలేజీలో, 26 కోర్సులు ఉన్నాయన్నారు. అయితే అందుబాటులో ఉన్న క్లాసులే కాకుండా మొత్తం కలిపి 45 క్లాస్ రూములు అవసరం ఉన్నాయన్నారు. ఒక 12 క్లాసు రూమ్ లో జి+టు భవనం 10,000 స్క్వేర్ ఫీట్ లో రెండున్నర కోట్లతో నిర్మించే విధంగా సిఎస్ఆర్ నిధులతో కోల్ ఇండియా సంస్థ సహకారంతో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. నిధుల సమీకరణ జరిగిన తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపడతామని మంత్రి చంద్రశేఖర్ వెల్లడించారు.
చరిత్ర కలిగిన కళాశాల: ఎమ్మెల్యే నసీర్
దాదాపు వంద సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ కాలేజ్ భవనాన్ని కొందరు పట్టించుకోని కారణంగా శిథిలావస్థకు చేరిందని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. అలాంటి కాలేజీని తిరిగి నిర్మించేందుకు చంద్రశేఖర్ ప్రయత్నాలు చేపడుతున్నారనీ, సిఎస్ఆర్ నిధులతో నిర్మాణానికి ఆయన తీసుకున్న నిర్ణయం చెప్పుకోదగింది అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సహకారంతో ఇంటర్మీడియట్ కళాశాలలో టాయిలెట్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోత్స్న, కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు.
