రావి, మర్రి, జువ్వి, మోదుగ, వేప, బిల్వం ఈ ఐదు దేవతా వృక్షాలు. రావి చెట్టుకు మూడు మార్లు ప్రదక్షణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షణ చేసినట్లుగా భావన. ‘అశ్వత్థ: సర్వ వృక్షాణాం’ అని భగవద్గీత వాక్యం. రావి విష్ణు స్వరూపమని, మర్రి శివ స్వరూపమని, జువ్వి బ్రహ్మ స్వరూపమని, వేప లక్ష్మీ స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి. ‘అశ్వత్థ: నారాయణుడు న్యగ్రోధ: మహేశ్వరుడు’ అనే వాడుక కలదు. ఆరాధనకు వీలుగా దేవతా వృక్షాలను దర్శించవచ్చు. దేవతా వృక్షాలను రోజు ఆరాధించలేము ఎక్కువ శాతం గుడిలలో చూడవచ్చు కావున ఇంట్లో ఉంచుకోరాదు. అలాగే మహా వృక్షాలు కావున వేర్లు క్రిందకు పారి పునాదులకు, గోడలకు భంగం ఏర్పడుతుంది కావున లౌకికంగా కూడా ఉంచుకోరాదు.
దేవతా వృక్షాలను పెరట్లో ఎందుకు పెంచరాదు?
- Post category:జాతీయం
- Post last modified:April 3, 2025
