
వెలగపూడి, ఆంధ్రప్రభ
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలకు మద్దతుగా అసెంబ్లీ వద్ద ధర్నా కు దిగారు.. ఈ సందర్భంగా బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ.. పీపీపీ విధానం అంటే దోపిడీ..! పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..? అని ప్రశ్నించారు.. ప్రజారోగ్యానికి వ్యతిరేకమైన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం.. దోపిడీ, అవినీతి కోసం ఈ విధానాన్ని తీసుకువస్తున్నారు.. ఇప్పటికే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం.. గతంలో ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదు.. ప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు రావాలని కోరుకుంటారు.. ఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు అని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
కాగా, . ఛలో మెడికల్ కాలేజీ పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నావైసిపి శ్రేణులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేస్తూ..ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టు చేస్తున్నారు.
ఆందోళనలకు అనుమతి లేదు – డిజిపి
వైసిపి నిర్వహిస్తున్న ఆందోళనలకు ఎటువంటి అనుమతి లేదని డిజిపి హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు.. రాష్ట్రమంతటా సెక్షన్ 30 అమలులో ఉందని గుర్తు చేశారు.. మీ ఆందోళనలతో పరీక్షలు రాస్తున్న వైద్య విద్యార్ధులకు ఆటంకం కలుగుతున్నదని పేర్కొన్నారు.. పరిమిత సంఖ్యలో జిల్లా కలెక్టరేట్ల వెళ్లి సంబంధిత అధికారులకు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వవచ్చని సూచించారు డిజిపి
